12, డిసెంబర్ 2012, బుధవారం

పిల్లలు పాడిన చక్కని పాట - పెద్దమనుషులు చిత్రం నుండి

మహానటి శ్రీరంజని (జూనియర్) కన్నీటి కనక వర్ష తారగా వాసికెక్కింది ఆ రోజుల్లో.  లతా మంగేష్కర్ తెలుగులో పాట పాడిన మొట్టమొదటి నటి శ్రీరంజని. ఆమె అసలు పేరు మహాలక్ష్మి. ఆమె 47 ఏళ్ళ వయస్సుకే అసువులు బాసింది. రాష్ట్రపతి పురస్కారం పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం పెద్ద మనుషులు (1954) లోని ఈ ప్రార్థనాగీతం మరపు రానిది. ఈ సమాచారం, యూ ట్యూబ్ వీడియో, మరియు సాహిత్యాన్ని సమకూర్చిన ప్రియన్సు దోనేపర్తి కి కృతజ్ఞతలు. 






చిత్రం:పెద్ద మనుషులు (1954)

రచన: ??

సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు, అద్దేపల్లి రామారావు 

గానం: పి.లీల, బృందం





పల్లవి: ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార - 2




చరణం: ఏ పాపమెరుగని పసిపాపలమురా


ఏ పాపమెరుగని పసిపాపలమురా


మన్నించి ముందుండి మమ్ము నడిపించు


ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార




చరణం: సంకుచిత భావాలు సమసిపోవంగ స్వాతంత్ర్య విజ్ఞాన జ్యోతి వెలగాలి


సంకుచిత భావాలు సమసిపోవంగ స్వాతంత్ర్య విజ్ఞాన జ్యోతి వెలగాలి


ఏ అధర్మమమునైన ఎదిరించి నిలిచి - 2


నిర్భయముగ మేము నిజమె పలకాలి


ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార




చరణం: పేదలు ధనికులు భేదాలు మాని చెలిమియే బలమంచు కలిసి బ్రతకాలి


పేదలు ధనికులు భేదాలు మాని చెలిమియే బలమంచు కలిసి బ్రతకాలి


ఏ కష్టమొచ్చినా ఎవరడ్డుపడినా


ఏ కష్టమొచ్చినా ఎవరడ్డుపడినా


దీక్షతో ధర్మమే ఆచరించాలి


ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Indices