మహానటి శ్రీరంజని (జూనియర్) కన్నీటి కనక వర్ష తారగా వాసికెక్కింది ఆ రోజుల్లో. లతా మంగేష్కర్ తెలుగులో పాట పాడిన మొట్టమొదటి నటి శ్రీరంజని. ఆమె
అసలు పేరు మహాలక్ష్మి. ఆమె 47 ఏళ్ళ వయస్సుకే అసువులు బాసింది. రాష్ట్రపతి పురస్కారం పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం పెద్ద మనుషులు
(1954) లోని ఈ ప్రార్థనాగీతం మరపు రానిది. ఈ సమాచారం, యూ ట్యూబ్ వీడియో, మరియు సాహిత్యాన్ని సమకూర్చిన ప్రియన్సు దోనేపర్తి కి కృతజ్ఞతలు.
చిత్రం: | పెద్ద మనుషులు (1954) | |
రచన: | ?? | |
సంగీతం: | ఓగిరాల రామచంద్ర రావు, అద్దేపల్లి రామారావు | |
గానం: | పి.లీల, బృందం |
పల్లవి: | ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార - 2 | |
చరణం: | ఏ పాపమెరుగని పసిపాపలమురా | |
ఏ పాపమెరుగని పసిపాపలమురా | ||
మన్నించి ముందుండి మమ్ము నడిపించు | ||
ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార | ||
చరణం: | సంకుచిత భావాలు సమసిపోవంగ స్వాతంత్ర్య విజ్ఞాన జ్యోతి వెలగాలి | |
సంకుచిత భావాలు సమసిపోవంగ స్వాతంత్ర్య విజ్ఞాన జ్యోతి వెలగాలి | ||
ఏ అధర్మమమునైన ఎదిరించి నిలిచి - 2 | ||
నిర్భయముగ మేము నిజమె పలకాలి | ||
ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార | ||
చరణం: | పేదలు ధనికులు భేదాలు మాని చెలిమియే బలమంచు కలిసి బ్రతకాలి | |
పేదలు ధనికులు భేదాలు మాని చెలిమియే బలమంచు కలిసి బ్రతకాలి | ||
ఏ కష్టమొచ్చినా ఎవరడ్డుపడినా | ||
ఏ కష్టమొచ్చినా ఎవరడ్డుపడినా | ||
దీక్షతో ధర్మమే ఆచరించాలి | ||
ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార |
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి